Saturday, July 27, 2024
Homeతెలంగాణరైతుల పంటలకు సాగు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో 

రైతుల పంటలకు సాగు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో 

రైతుల పంటలకు సాగు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో 

జగిత్యాల,మార్చి01,(కలం శ్రీ న్యూస్):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం లోని వేమునూరు. ఉండెడ, ముంజంపల్లి, మారేడు పల్లి గ్రామాల రైతుల అందరికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు లోని వేమునూరు పంపు హౌజ్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి రైతులకి శాశ్వత పరిష్కారం చూపాలని, వెల్గటూరు మండలం లోని జంగలునాల ప్రాజెక్టు కి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని కోరుతూ బుధవారం ఉదయం 11 గంటలకి ఎండపల్లి మండల కేంద్రము లోని రెవెన్యూ శాఖ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వెల్గటూరు మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి తెలిపారు. కావున వెల్గటూరు, ఎండపల్లి మండలాల రైతులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా శైలేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.వేమునూరు పంపు హౌజ్ ద్వారా రైతుల పంటలకు సాగునీరు వెంటనే నీటిని విడుదల, జగదేవుపేట జంగల్ నాల ప్రాజెక్టు ద్వారా కూడా రైతులకు నీరందించి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతూ ఎండపల్లి మండలం లోని రాజారాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఉదయం పదకొండు గంటలకు వెల్గటూరు, ఎండపల్లి, ధర్మారం మండలాల కాంగ్రెస్ పార్టీ నేతలతో కార్యకర్తలతో బైక్ ర్యాలీ ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎండపల్లి మండలం రెవెన్యూ శాఖ కార్యాలయం ముందు రామాయపట్నం కోదాడ రాష్ట్ర రహదారి పై పలు గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో అర గంట సేపు రాస్తారోకో చేశారు.

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం లోని వేమునూరు. ఉండెడ, ముంజంపల్లి, మారేడు పల్లి గ్రామాల రైతుల అందరికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు లోని వేమునూరు పంపు హౌజ్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి రైతులకి శాశ్వత పరిష్కారం చూపాలని , వెల్గటూరు మండలం లోని జంగల్ నాల ప్రాజెక్టు ద్వారా నీరందించాల్సిన కొండాపూరు, శాఖాపూరు, జగదేవుపేట, లొత్తునూరు గ్రామల పంట పొలాల రైతులకు సాగు నీరు అందించి శాశ్వత సాగునీటి పరిష్కారం చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, తాటిపర్తి శైలేందర్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు యున సేవ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణు గోపాల్, వెల్గటూరు సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, అంబారిపేట, కొండాపూరు గ్రామాల మాజీ సర్పంచ్ లు గుండాటి జలేందర్ రెడ్డి, దొంగ రాజిరెడ్డి, గాజుల విజయ్ గౌడ్, మ్యాకల సంతోష్ యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, గాజుల శ్రీనివాస్ గౌడ్, ఉప్పునూటి మహేష్ శాలివాహన, గుండ్ల చంద్రమౌళి లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!