Saturday, July 27, 2024
Homeతెలంగాణవిద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ

చెల్లాపూర్ లో స్వయం స్వపరిపాలన దినోత్సవ వేడుకల్లో కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి.

సిద్దిపేట,మార్చి01(కలం శ్రీ న్యూస్):సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ పరిధిలోని చెల్లాపూర్ రెండవ వార్డులో ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు స్వయం స్వపరిపాలన దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా స్థానిక వార్డు కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి చిన్న వయసులో జరిగిన స్వయం స్వపరిపాలన గురించి తెలియజేసారు. ఏదైనా మనం అనుభవిస్తేనే దానిగురించి మనకు పూర్తిగా తెలుస్తుంది అని, నేటి స్వయం పరిపాలన దినోత్సవం తో విద్యార్థుల జీవితలో మలుపు రావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ బాసిరెడ్డి కొండల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం,ఆయాలు, నాయకులు గుండవెళ్లి కిష్టయ్య,మద్దికుంట బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!