Saturday, July 27, 2024
Homeతెలంగాణప్రీతినాయక్ కు కొవ్వత్తులతో నివాళులు 

ప్రీతినాయక్ కు కొవ్వత్తులతో నివాళులు 

ప్రీతినాయక్ కు కొవ్వత్తులతో నివాళులు 

మంథని ఫిబ్రవరి 28(కలం శ్రీ న్యూస్):మంథని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం నివాళులు అర్పించారు.మొన్నటి రోజున కాళోజి నారాయణ యూనివర్సిటీలో మెడికల్ విద్యార్థిని డాక్టర్.ప్రీతినాయక్ పై సీనియర్ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడంతో ప్రీతి నాయక్ ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంథని అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించడం జరిగింది.ప్రభుత్వం వెంటనే స్పందించి దోషిని కఠినంగా శిక్షించాలని మరల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చట్టాలు చేయాలని వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శశి భూషణ్ కాచే, పెండ్రు రమా,మూల సరోజన ,నిహారిక, అజీమ్ ఖాన్, గోటికార్ కిషన్,జంజర్ల శేఖర్ ,మంథని సత్యం, బండారి ప్రసాద్ ,వేల్పుల పొచం,మంతిని రాకేష్, రవితేజ గౌడ్, ఐలి ప్రసాద్ ,పెంటరి రాజు, కొమ్మిడి సంతోష్ ,ఎరుకల రమేష్ ,బూడిద శంకర్ ,ఎల్లంకి వంశి,జగదీష్, దాసరి వేంకట స్వామి, పెరవేన రాజు,ఉరగొండ గణేష్,గుండేటి రాజశేఖర్,గాజుల నిఖిల్ ,గువ్వల ప్రశాంత్ ,రంజీత్ ,బడికల మనోజ్ ,ఎరుకల నిరంజన్ ,పెరుగు తేజ,ఎరుకల మోహన్ సాయి,కిరణ్ గౌడ్, కేక్కేర్ల సందీప్, పోగుల సాగర్ ,నరేడ్ల కిరణ్,పంచిక దేవేందర్,బడికల ప్రశాంత్,బనాల దేవేందర్,శేఖర్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!