Saturday, July 27, 2024
Homeతెలంగాణజూలపల్లిలో బోర్ వెల్ ఏర్పాటుకు భూమి పూజ

జూలపల్లిలో బోర్ వెల్ ఏర్పాటుకు భూమి పూజ

జూలపల్లిలో బోర్ వెల్ ఏర్పాటుకు భూమి పూజ

పెద్దపల్లి ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్ ):కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలోని మల్లిఖార్జున స్వామి, బీరన్న ఆలయాల ప్రాంగణంలో సింగరేణి నిధుల ద్వారా బోర్ర్ వెల్ ఏర్పాటు కోసం గురువారం స్థానిక సర్పంచ్ బొల్లపెల్లి శంకర్ గౌడ్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాభివృద్ధికి సింగరేణి సంస్థ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తుండడం హర్షనీయమన్నారు. మా గ్రామంలోని రైతులు సింగరేణి, ఎన్ టీ. పీ. సీ సంస్థలకు సిరులు పండే పంట భూములను త్యాగం చేయడం జరిగిందన్నారు. ఇంకా ఈ రెండు సంస్థ లు గ్రామ అభివృద్ధికి మరింత దోహదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఎస్ ఈ సివిల్ పద్మరాజు, డివైజిమ్ షఫీ సివిల్ సూపెర్వైసర్ సమ్మయ్య మల్లిఖార్జున స్వామి దేవస్థానం చైర్మన్ ఎలబోయిన కుమార్, కుర్మ సంఘము అధ్యక్షులు కొమ్ము వెంకన్న, బీరన్న ఆలయ చైర్మన్ కొమ్ము గోపాల్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!