Saturday, July 27, 2024
Homeతెలంగాణనేటి నుంచి శ్రీ అయప్ప స్వామికి మహా కుంభాభిషేక మహోత్సవాలు

నేటి నుంచి శ్రీ అయప్ప స్వామికి మహా కుంభాభిషేక మహోత్సవాలు

నేటి నుంచి శ్రీ అయప్ప స్వామికి మహా కుంభాభిషేక మహోత్సవాలు

 

మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్):మంథని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి 4 రోజులపాటు మహా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ గురువారం వెల్లడించింది. కేరళ చెందిన శ్రీ సంజీవ్ నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ఈనెల 24, 25, 26, 27వ తేదీల్లో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ శివ, శ్రీ విష్ణు శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీ ప్రసన్నాంజనేయ, నవగ్రహ విగ్రహాలకు ధ్వజస్తంభానికి మహాకుంభిషేకాన్ని నిర్వహిస్తామన్నారు.అలాగే ప్రత్యేక పూజలు అర్చనలు, హోమాలను నిర్వహిస్తామన్నారు. 27న సోమవారం ఉ: 9-11 గంటల వరకు శ్రీ అయ్యప్పస్వామికి 1008 జంటచే సహస్ర కలశపూజ,సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తామన్నారు.సహస్ర కలశ పూజలో పాల్గొనే జంటలు ఈనెల 26వ తేదీ వరకు రూ.1వెయ్యి చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మహా కుంభాభిషేకాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు కొమురవెల్లి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు మల్క రామరావు, ఎరుకల పోచం, సహాయ కార్యదర్శి సింగారపు కిష్టయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి కొంతం రమేష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!