అవార్డు గ్రహీత,అడ్వకేట్ కు అభినందనలు తెలిపిన దుద్దిళ్ల
హైదరాబాద్,మార్చి07(కలం శ్రీ న్యూస్):హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సచివాలయంలో గల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఛాంబర్ లో గురువారం రాత్రి గత నాలుగు రోజుల కింద బహుజన సాహిత్య అకాడమీ వారు ఇచ్చిన జాతీయ సేవారత్న అవార్డు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు లో అడ్వకేట్ ప్రాక్టీస్ కొరకు బార్ కౌన్సిల్ ఎన్ రోల్, ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన ధృవీకరణ పత్రం పొందిన సందర్భంగా మన జననేత, రాష్ట్ర ఐ.టి. శాఖా మంత్రి శ్రీధర్ బాబు దీవెనలు, ఆశీస్సులు తీసుకొన్న ఇనుముల సతీష్.అనంతరం శ్రీధర్ బాబు సతీష్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో మరింతగా రాణించాలని కోరారు.