పోలీస్ ఆధ్వర్యంలో గర్రెపల్లి లో పల్లెనిద్ర
సుల్తానాబాద్,జులై,20(కలం శ్రీ న్యూస్):
గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతూ శాంతి భద్రతల పరిరక్షణ చేయుట ముఖ్య ఉద్దేశమని సిఐ సుబ్బారెడ్డి , ఎస్ఐ శ్రావణ్ కుమార్, నరేష్,లు అన్నారు . మండలంలోని గర్రెపల్లి గ్రామంలో శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని గ్రామ ముఖ్య నాయకులు ,అన్ని పార్టీల నాయకులు, ప్రజలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సిఐ సుల్తానాబాద్ మాట్లాడుతూ ప్రజలకు మీ రక్షణ భద్రత గురించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, పోలీస్ మీ కోసం ఉంటుందనే నమ్మకం కల్పిస్తూ, అసాంఘిక శక్తుల ను కట్టడి చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రజలతో మమేకమైతు సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఐ తెలిపారు. గ్రామాలలో పోలీస్ నైట్ హాల్ట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాంతియుత వాతావరణం కల్పించడంతోపాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించవచ్చని గ్రామాల్లో కేసుల వివరాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ,ఇతర సమస్యలు తెలుసుకోవచ్చునని, ఘర్షణలు జరగకుండా నిరోధించవచ్చని అన్నారు .గ్రామాలలో అపరిచిత వ్యక్తులు కనిపించిన, ఏమి జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.