రైలు ప్రమాదంలో మాజీ సింగరేణి కార్మికుడు మృతి
పెద్దపల్లి,జులై11(కలం శ్రీ న్యూస్):
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం పెద్దపల్లి నుండి ఓదెల వెళ్లేందుకు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ నుండి రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ వైపు రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడని తెలిసింది. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామం నివాసి సింగరేణి విశ్రాంత కార్మికుడు రామినేని శంకరయ్య (68) గా గుర్తించారు. రామినేని శంకరయ్య సింగరేణి కంపెనీ లో విధులు నిర్వహించి ఇటీవల పదవి విరమణ పొందారు. మృతుడు స్వగ్రామమైన ఓదెలలో స్థిరపడ్డాడు.రామినేని శంకరయ్య మరణంతో ఓదెల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.