వైభవంగా శ్రీ ఆదిశంకరాచార్య జయంతోత్సవాలు ప్రారంభం..
మంథని ఏప్రిల్ 21(కలం శ్రీ న్యూస్ ):మంథనిలోని శ్రీశీలేశ్వర సిద్ధేశ్వరాలయంలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య ఉపాయంలో జగద్గురు జయంతోత్సవాలను వేదోక్తంగా శుక్రవారం ప్రారంభించారు. ఈనెల 25న జరిగే జగద్గురు ఆదిశంకరాచార్య జయంతిని పురస్కరించుకొని వేద పండితులు శివాలయంలో 4 రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆలయంలోని స్వామికి ప్రత్యేక అభిషేకాలు,అర్చనలు చేయడంతో పాటు వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. ధర్మజ్యోతి ప్రజ్వలన, ప్రాతఃకాల పూజ, వేద పారాయణం, గురువందనం, సాయంకాల పూజ,గురు వందనం,రాజోపచారములు, భజన, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.జగద్గురు జయం తోత్సవాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.