బీజేపీ పార్టీ లో చేరిన అడవి సోమన్ పల్లి గ్రామస్తులు.
మంథని ఏప్రిల్ 26(కలం శ్రీ న్యూస్ ):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో అడవి సోమనపల్లి గ్రామానికి చెందిన పలువురు బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన దేశ అభివృద్ధిని చూసి సునీల్ రెడ్డి తో కలిసి పని చేయాలనే లక్ష్యంతో పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ మంథని ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారని 40 సంవత్సరాలు కాంగ్రెస్, 9 సంవత్సరాలు బారాస పాలించిన మంథని ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రజలు బిజెపి పార్టీని ఆదరిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో మంథనితో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందని అన్నారు.ఈకార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,మండల ఇంచార్జ్ వీరబోయిన రాజేందర్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లిక్,చెరుకుతోట సురేష్,బూడిద తిరుపతి,ఎల్క సదానందం,కనుకుంట్ల సుధాకర్, కుర్మ శేఖర్,తదితరులు పాల్గొన్నారు